జగ్గయ్యపేట నియోజకవర్గంలోని తక్కెళ్ళపాడు గ్రామంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ప్రకృతి ఆశీర్వాదంతో భూమికి కొత్త శ్వాస పోసే ఈ పండుగను గ్రామస్తులు ఆనందంతో జరుపుకున్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పాల్గొని వృషభాలకు అలంకరణ చేసి, దున్నకానికి శ్రీకారం చుట్టారు. వృషభాలపై పూజలు చేసి, మట్టికి నమస్కరించి సాగుకు శ్రీకారం చుట్టిన తీరు హర్షణీయం.
రైతే దేశానికి బడ్జెట్ – అన్నదాత శ్రమకి సమాజం కృతజ్ఞతలు చెప్పే రోజే ఈ ఏరువాక పౌర్ణమి.
ఈ సందర్భంగా ఆయన ప్రకృతి సానుకూలంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ, పంటలు బాగా పండాలని రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.
🐂 జంతు భరణానికి సమాన ప్రాధాన్యత ఉండాలని, మనిషితో పాటు పశువుకీ జీవన హక్కులు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో పశువుల తాగునీటి తొట్టెల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా చర్యలు తీసుకోవడం జరిగిందని, ఇంకా అవసరమైన చోట చేపట్టాలని సూచించారు.
♻️ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి, ఆవరణలో మొక్క నాటి… పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థాయి నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భూమి పట్ల కృతజ్ఞతతో సాగు ప్రారంభించిన ఈ పండుగ – గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఓ శుభ సంకేతంగా నిలిచింది.